ప్రగతి భవన్లో కుక్క చస్తే కేసు పెడతరు..గాంధీ ఆస్పత్రిలో మనుషులు చస్తే పెట్టరా?

ప్రగతి భవన్లో కుక్క చస్తే కేసు పెడతరు..గాంధీ ఆస్పత్రిలో మనుషులు చస్తే పెట్టరా?

హైదరాబాద్ లోని  ప్రగతి భవన్ లో కుక్క చనిపోవడానికి డాక్టర్ల నిర్లక్షమే కారణమంటూ కేసు నమోదయింది. ప్రగతి భవన్లో  హస్కీ అనే కుక్క ఈ నెల  10 న జ్వరంతో బాధపడుతూ చనిపోయింది. అయితే కక్కుకు ట్రీట్ చేసిన డాక్టర్లు నిర్లక్షంగా వ్యవహరించారంటూ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. అయితే దీనిపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ లో కుక్క చనిపోతే కేసు నమోదు చేసిన ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో  డెంగీతో ఆరుగురు పిల్లలు చనిపోతే చర్యలు తీసుకోరా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కుక్కల కంటే ప్రజలు అధ్వానమా? అని అన్నారు శ్రావణ్.