సామాజిక న్యాయ సాధనకు అసెంబ్లీ వేదిక కావాలి : దాసు సురేశ్

సామాజిక న్యాయ సాధనకు అసెంబ్లీ వేదిక కావాలి : దాసు సురేశ్

బషీర్​బాగ్, వెలుగు: సామాజిక న్యాయ సాధనకు అసెంబ్లీ వేదిక కావాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ కోరారు. తెలంగాణ అసెంబ్లీకి మూడో స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ను శుక్రవారం హైదర్ గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో దాసు సురేశ్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.  విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో బడుగు వర్గాలు ఎదుర్కుంటున్న పలు సవాళ్లను ఈ సందర్భంగా ఆయన స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.

అసెంబ్లీ వేదికగా అట్టడుగు వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడానికి జరిగే చర్చలకు పూర్తిస్థాయిలో సహకరించాలని స్పీకర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్​గా ఎన్నికవడం బలహీన వర్గాల నాయకత్వానికి స్ఫూర్తిదాయకమన్నారు. దాసు సురేశ్ వెంట బీసీ రాజ్యాధికార సమితి గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి, మహిళా యువజన కన్వీనర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.