ఇకపై ఎయిరిండియా విమానం ఎక్కను: అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్ ప్రమాదం తర్వాత డేవిడ్‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామెంట్

ఇకపై ఎయిరిండియా విమానం ఎక్కను: అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్ ప్రమాదం తర్వాత డేవిడ్‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామెంట్

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ ప్రమాదంపై ఆస్ట్రేలియా క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎయిరిండియా సిబ్బందినని చెప్పుకుంటూ ఓ వ్యక్తి యూట్యూబ్​లో పెట్టిన కామెంట్​ను వార్నర్ స్క్రీన్ షాట్ తీసి షేర్  చేశాడు. ప్రమాదానికి గురైన ఫ్లైట్​లో భద్రతా  ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ సరిగ్గా అమలు చేయలేదని సదరు వ్యక్తి తన కామెంట్​లో పేర్కొన్నాడు. 

ఏండ్ల తరబడి మెకానికల్‌‌‌‌‌‌‌‌ సమస్యలు ఉన్నాయని, సిబ్బంది, పైలట్లు, ఇంజినీర్లు ఈ విషయాన్ని లాగ్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసినప్పటికీ మేనేజ్​మెంట్ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించాడు. దీనిపై వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పందిస్తూ.. ‘‘ఇది నిజమే అయితే మాత్రం దారుణం.. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ఘటన తర్వాత  ఎయిరిండియాలో ఇకపై ప్రయాణించవద్దని నిర్ణయించుకున్నా” అని వార్నర్  చెప్పారు.