ప్రభుత్వానికి టానిక్ లాంటి తీర్పిచ్చారు.. ఎల్లుండి హుజూర్ నగర్ వస్తా: కేసీఆర్

ప్రభుత్వానికి టానిక్ లాంటి తీర్పిచ్చారు.. ఎల్లుండి హుజూర్ నగర్ వస్తా: కేసీఆర్
  • నేరుగా ప్రజలకు థ్యాంక్స్ చెప్పాలి
  • ప్రజల ఆశలకు తగ్గట్టు ప్రకటన చే్స్తా
  • అద్భుతమైన తీర్పు ఇచ్చారు
  • ఇది మా ప్రభుత్వానికి టానిక్ లాంటిది

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు సీఎం కేసీఆర్. ప్రతిపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. ప్రజలు ఆలోచించి ఓటు వేశారని ఆయన అన్నారు. బై పోల్ కౌంటింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలో గెలిచినా ఓడినా ప్రభుత్వమేమీ మారేది లేదని చెప్పారు. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, పని చేసే ప్రభుత్వానికి ఇదో టానిక్ లాంటిదని అన్నారు కేసీఆర్. తాము మరింత ఉత్సాహంతో పని చేసేందుకు ప్రజలు తమని బలపరిచారని చెప్పారు. ప్రతిపక్షాలు తమపై ఇటీవల చాలా నిందలు వేశారని, అయినా గత ఎన్నికల్లో 7 వేల తేడాతో ఓడిపోయిన ఆ సీటును ఇప్పుడు ప్రజలు 43 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని చెప్పారు. ఇది టీఆర్ఎస్ 50 వేల మెజారిటీ సాధించినట్లు లెక్కఅని అన్నారు.

ప్రజల ఆశల్ని నెరవేరుస్తా

హుజూర్ నగర్ లో సాగునీటి సమస్య ఉందని, ‘సాగర్ ఆయకట్లు రైతుల ఇబ్బందుల్ని పరిష్కరిస్తామని చెప్పారు కేసీఆర్. ప్రజల ఆశలు నెరవేరుస్తామని అన్నారు. ఎన్నిక ప్రచార సమయంలో వర్షం వల్ల తన సభ రద్దవడంతో హుజూర్ నగర్ రాలేకపోయానని చెప్పారాయన. ఎల్లుండి నేరుగా హుజూర్ నగర్ వచ్చి ప్రజలకు థ్యాంక్స్ చెబుతానని అన్నారు అక్కడికక్కడే ప్రజల ఆశయాల మేరకు ప్రకటన చేస్తానని చెప్పారు.

ప్రతిపక్షాలు పద్ధతి మార్చుకోవాలి

ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతిపక్షాలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, ఏది పడితే అది మాట్లాడితే వారికే బూమరాంగ్ అవుతుందని రుజువైందని అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని మననే శపించుకోవడం, నెగిటివ్ కామెంట్లు చేయడం సరికాదని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని అన్నారు.