
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయని చెప్పింది. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ.4.33 లక్షల కోట్లు ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం చెప్పారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపి చేసిన అప్పుగా పేర్కొంది. సుమారు 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి తీసుకున్న రుణాలు రూ.లక్షా 30వేల కోట్లని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది.