ఆ నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుంది : కపిల్

ఆ నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుంది : కపిల్

ఇంగ్లండ్‌ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌తో భారత క్రికెట్‌ జట్టు ఆడాలా.. వద్దా అనే నిర్ణయాన్ని కేంద్ర ప‍్రభుత్వానికే వదిలేద్దామన్నారు భారత మాజీ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ పాక్ జట్టుతో టీమిండియా ఆడాలా వద్దా అన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది.

పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలోమాట్లాడిన కపిల్ దేవ్.. ‘పాకిస్తాన్‌తో టీమిండియా ఆడాలా, వద్దా అన్నదానిపై మనలాంటి వాళ్లు నిర్ణయాలు తీసుకోకూడదు. దాన్ని ప్రభుత్వమే నిర్ణయించాలి. దీనిపై మనం అభిప్రాయాలు తెలపడం కాకుండా… ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు వదిలేయాలి. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాల కోసమే కదా… కాబట్టి వాళ్లేం కోరుకుంటారో అదే మనం చేద్దాం’ అని తెలిపారు.