
కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. సోమవారం ( అక్టోబర్ 20 ) దీపావళి సందర్భంగా ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీపావళి ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్పస్వామి, శ్రీ-భూ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీవారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలను అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు.
ఈ క్రమంలో నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు అర్చకులు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తి అయినది. అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను ఆశీర్వదించారు అర్చకులు.