ఆస్కార్‌‌‌‌‌‌‌‌ ప్రెజెంటర్‌‌‌‌‌‌‌‌గా దీపిక పదుకొనే

ఆస్కార్‌‌‌‌‌‌‌‌ ప్రెజెంటర్‌‌‌‌‌‌‌‌గా దీపిక పదుకొనే

గ్లామర్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌తోనే కాదు యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌లోనూ మెప్పించగలనని ‘పటాన్‌‌‌‌’తో మరోసారి ప్రూవ్ చేసింది దీపిక పదుకొనే. బ్లాక్‌‌‌‌ బస్టర్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమెకు.. ఆస్కార్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌కు ఆహ్వానం లభించింది. అది కూడా ఈసారి అవార్డుల ప్రజెంటర్‌‌‌‌‌‌‌‌గా ఆమె ఈ వేడుకకు హాజరు కాబోతోంది.  విజేతలకు ఆస్కార్ అవార్డుని అందించబోయే పదహారు మంది సెలబ్రిటీస్‌‌‌‌లో దీపిక పేరును ‘అకాడెమీ’ సంస్థ ప్రకటించింది. ఎమిలీ బ్లంట్, డ్వైన్ జాన్సన్, మైఖెల్ బి జోర్డాన్, జోనాథన్ మేజర్స్, రిజ్ అహ్మద్, అరియానా డీబోస్, శామ్యూల్ ఎల్ జాక్సన్‌‌‌‌ లాంటి  ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్‌‌‌‌తో పాటు దీపిక ప్రెజెంటర్స్ లిస్టులో ఉండటం విశేషం. ఈనెల 12న డాల్బీ థియేటర్‌‌‌‌లో ఆస్కార్‌‌‌‌ అవార్డుల వేడుక జరగబోతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో  ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ రేసులో పోటీపడుతున్న విషయం తెలిసిందే. సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌‌‌‌లో ఈ పాట పాడబోతున్నారు. అలాగే  ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి అటెండ్ అవబోతున్నారు.