బ్రిగేడియర్ లిద్దర్ కు రాజ్ నాథ్ నివాళులు

బ్రిగేడియర్ లిద్దర్ కు రాజ్ నాథ్ నివాళులు

న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ లో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ కు ఆయన కుటుంబీకులు నివాళి అర్పించారు. భార్య, కూతురు లిద్దర్ భౌతిక కాయాన్ని కడసారి చూసి కన్నీరుమున్నీరయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా లిద్దర్ కు నివాళి అర్పించారు. లిద్దర్ సేవలకు గానూ ఆయన సెల్యూట్ చేశారు. ఢిల్లీలోని మిలిటరీ బేస్ హాస్పిటల్లో ఉన్న లిద్దర్ భౌతికకాయాన్ని బ్రార్ స్క్వేర్ వద్ద క్రిమటోరియంకు  తరలించారు. ఆయనతో పాటు.. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తోపాటు ఇతర అధికారులు కూడా నివాళులు అర్పించారు. అనంతరం లిద్దర్ కుటుంబ సభ్యులతో రాజ్ నాథ్ మాట్లాడి వారిని ఓదార్చారు. తర్వాత లిద్దర్ యూనిఫామ్, జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అందజేశారు అధికారులు. కన్నీరు పెట్టుకుంటూనే వాటిని అందుకున్నారు.