‘సింధ్’ తిరిగి భారత్లో కలవొచ్చు : మంత్రి రాజ్నాథ్ సింగ్

‘సింధ్’ తిరిగి  భారత్లో కలవొచ్చు : మంత్రి రాజ్నాథ్ సింగ్
  • రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్

న్యూఢిల్లీ: ‘‘సింధ్​ ప్రాంతం ఇవ్వాల మన దేశంతో కలిసి లేకపోవచ్చు.. కానీ తొందర్లోనే ఆ ప్రాంతమంతా తిరిగి మన భూభాగంలో కలవచ్చు. భౌగోళికంగా విడిపోయినా నాగరికత పరంగా చూసుకుంటే సింధ్​ఎల్లప్పుడూ భారత్​తోనే ఉంది. భూభాగానికి సంబంధించిన ఆందోళనలు కొనసాగుతున్న చోట సరిహద్దుల్లో మార్పులు తప్పకుండా చోటుచేసుకుంటాయి” అని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్  పేర్కొన్నారు. 

ఈమేరకు ఆదివారం ఢిల్లీలో జరిగిన సింధి సమాజ్ సమ్మేళన్ లో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన సమయంలో సింధ్​ ప్రావిన్స్ పాకిస్తాన్ పరం కావడంతో అక్కడి హిందువులు చాలామంది భారత్ కు వచ్చేశారు. సింధూ నది పరీవాహక ప్రాంతంలోని  ఈ ప్రావిన్స్ నాగరికతపరంగా భారత్ తో కలిసే ఉంది. 

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్​ ప్రస్తావిస్తూ.. ఎల్ కే అడ్వాణి తరం నేతలు సింధ్​ ప్రావిన్స్ భారత్ లో భాగం కాదనే విషయాన్ని ఎన్నడూ అంగీకరించలేదని గుర్తుచేశారు. సింధూ నదిని అక్కడి ప్రజలు మాత్రమే కాదు, మొత్తం భారతీయులంతా పవిత్రంగా భావిస్తారని, దైవంగా కొలుస్తారని రాజ్ నాథ్ చెప్పారు.