ఢిల్లీలో బైకర్ విషాద ఘటన..పది నిమిషాల్లో వస్తానన్నాడు..యానివర్సరీ డే కేక్ రెడీగా ఉంది..ఇంతలోనే

ఢిల్లీలో బైకర్ విషాద ఘటన..పది నిమిషాల్లో వస్తానన్నాడు..యానివర్సరీ డే కేక్ రెడీగా ఉంది..ఇంతలోనే

అప్పుడు సరిగ్గా  11.50 గంటలు.. ఇంకా రాలేదని కమల్​ కి ఫోన్​ చేశాం.. మరో పది నిమిషాల్లో ఇంటికి వస్తానన్నాడు.. మా యానివర్సరీ కేక్​ రెడీ ఉంది.కమల్​ కోసం ఎదురు చూస్తున్నాం.. పది.. ఇరవై.. అరగంట గడిచిపోయింది..అయినా కమల్​ ఇంటికి రాలేదు.. చుట్టు పక్కల వెదికాం..పార్కులు వెదికాం..రాత్రంతా వెదుకుతూనే ఉన్నాం.. మా దురదృష్టం తెల్లవారుతుండగానే..విషాదకరమైన వార్త విన్నాం..ఢిల్లీలో రోడ్డుపై గుంతలోపడి మృతిచెందిన బైకర్​ కమల్​ను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 

ALSO READ : నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం.. 

గురువారం (ఫిబ్రవరి 6)  రాత్రి ఢిల్లీలోని జనక్​ పురిలో రోడ్డుపై వాటర్​బోర్డు తవ్విన గుంతలోపడి HDFC బ్యాంకు మేనేజర్​ కమల్ మృతిచెందడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  కొడుకు ఎదిగాడు.. ఉద్యోగం చేస్తున్నాడు..కుటుంబాన్ని పోషిస్తాడు అనుకునే సమయంలో  కమల్ చనిపోవడంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.  వాటర్​ బోర్డు గుంతలు తవ్వి ఎలాంటి సంకేతాలు లేకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రమాదం జరిగింది.తమ కుమారుడు చనిపోయాడని ఆరోపించారు.  కమల్ పేరెంట్స్​ ఫిర్యాదులో ఢిల్లీ వాటర్​ బోర్డు అధికారులపైకేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనతో ఢిల్లీ వాటర్​ బోర్డు అధికారులు పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

ALSO READ : అమెరికాలో 'జీరో డ్యూటీ'తో భారతీయ రైతులకు పండగే..!

నడిరోడ్డుపై 20 అడుగుల పొడవు, 14 అడుగుల లోతు, 13 అడుగుల వెడల్పు గుంతను తవ్వి ఎటువంటి హెచ్చరిక బోర్డులు గానీ, బారీకేడ్లు గానీ, సరైన లైటింగ్​ గానీ పెట్టకపోవడం వంటి  భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ప్రమాదానికి కారణమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు, కమల్​ కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యాన్ని హైలైట్ చేశారు. 

కమల్ విషాద మరణం పట్ల ఢిల్లీ వాటర్​ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది. వాటర్​ పైపులైన్​ నిర్మాణ పనులు జరుగుతున్న ది నిజమే..అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన తర్వాత ముగ్గురు వాటర్ బోర్డు ఇంజనీర్లను సస్పెండ్​ చేశారు.