కాలేజీ బయట.. పోలీస్ స్టేషన్ పక్కనే.. రోడ్డుపై అమ్మాయిని రాడ్డుతో కొట్టి చంపారు

కాలేజీ బయట.. పోలీస్ స్టేషన్ పక్కనే.. రోడ్డుపై అమ్మాయిని రాడ్డుతో కొట్టి చంపారు

ఎంతకు అంటే అంతకు తెగించేస్తున్నారు.. భయం, భక్తి అస్సలే ఉండటం లేదు.. నడి రోడ్డలపై అమ్మాయిలను అన్యాయం కొట్టి చంపేస్తున్నారు. ప్రేమాగీమా అంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన ఇప్పుడు షాక్ కు గురి చేస్తుంది. ఢిల్లీలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన మాలవీయ నగర్ ఏరియాలోనే కాలేజీ బయట.. పోలీస్ స్టేషన్ కు 200 మీటర్ల దూరంలో.. నడి రోడ్డుపై 25 ఏళ్ల అమ్మాయిని.. ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు ఓ కుర్రోడు.. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై కేంద్ర మహిళా హక్కుల కమిషన్ సైతం స్పందించటంతో.. ఢిల్లీ పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

దక్షిణ ఢిల్లీలోని మాళవియా నగర్ ప్రాంతంలో జూలై 26న ఒక విద్యార్థిపై ఓ యువకుడు రాడ్‌తో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కమల నెహ్రూ కాలేజీ విద్యార్థిని. దాడి జరిగిన వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించగా, ఆమె మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ ఘటన ఢిల్లీలోని అరబిందో కళాశాల సమీపంలో మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో జరిగింది.

Delhi | We received information that the body of a 25-year-old girl was found near Aurbindo College in South Delhi's Malviya Nagar. An iron rod was found near her body. According to a preliminary investigation, the girl was attacked with a rod. Further investigation is in… pic.twitter.com/eCOeVAd1yi

— ANI (@ANI) July 28, 2023

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అనంతరం నిందితుడిని పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు త్వరితగతిన చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడిని ఆ యువకుడిని పట్టుకోవడానికి అనేక బృందాలను ఏర్పాటు చేశారు. అనంతరం అతన్ని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.

దక్షిణ ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లోని అరబిందో కళాశాల సమీపంలో 25 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైనట్లు తమకు సమాచారం అందిందని దక్షిణ ఢిల్లీ డీసీపీ చందన్ చౌదరి ఈ సందర్భంగా తెలిపారు. ఆమె మృతదేహం సమీపంలో ఇనుప రాడ్ లభించిందని, ప్రాథమిక విచారణ ప్రకారం, ఆమెపై రాడ్‌తో దాడి చేశారని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

ఘటనపై స్పందించిన డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్

ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. “ఢిల్లీలో ఒక మహిళ తన ఇంటి బయట కాల్చి చంపబడింది. మరోవైపు, మాలవ్య నగర్ లో, ఒక అమ్మాయిని రాడ్ తో కొట్టి చంపారు. ఢిల్లీ ఇప్పుడు సురక్షితమైంది కాదు. కానీ ఇది ఎవరికీ పట్టింపు లేదు. వార్తాపత్రికలలో అమ్మాయిల పేర్లు మారుస్తారు తప్ప.. నేరాలు మాత్రం ఆగవు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

दिल्ली में जहां एक महिला को उसके घर के बाहर गोली मारके उसकी हत्या की गई वहीं दूसरी तरह मालवीय नगर जैसे पॉश इलाक़े में लड़की को रॉड से मारा गया। दिल्ली बेहद असुरक्षित है। किसी को फ़र्क़ नहीं पड़ता। सिर्फ़ अख़बार की खबरों में लड़कियों के नाम बदल जाते हैं, अपराध नहीं रुकते।

— Swati Maliwal (@SwatiJaiHind) July 28, 2023