
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆర్మీ క్యాంటీన్ లో ఆదివారం పొద్దున మంటల చెలరేగాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఫైర్ ఆఫీస్ సర్వీస్ అఫీషియల్స్ తెలిపారు.
మంటలు చల్లార్చడానికి ఉదయం 9 గంటల సమయంలో 8 ఫైర్ టెండర్ వెహికిల్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు పేర్కొన్నారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నామని వారు చెప్పారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఆర్మీ క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్ మెంట్ (సీఎస్ డీ) ఢిల్లీ కంటోన్ మెంట్ కిందకు వస్తుంది. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.