
నిర్మల్ జిల్లా: మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తికి నెల రోజుల తర్వాత కరోనా పాజిటివ్ రావడం నిర్మల్ జిల్లాలో కలకలం రేపుతోంది. రెండు సార్లు నెగెటివ్ వచ్చిన వ్యక్తికి మూడోసారి చెక్ చేసినప్పుడు పాజిటివ్ రావడంతో చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల కింద వైరస్ లక్షణాలు కనిపించడంతో మళ్లీ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది.
దీంతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులను క్వారంటైన్ కు తరలించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కరోనా పాజిటివ్ వ్యక్తితో పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ పై దృష్టి పెట్టింది. హోంక్వారంటైన్ లో ఉన్న వారందరినీ మరోసారి టెస్టులు చేయనున్నట్లు తెలుస్తోంది.