ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలి..తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర: మంత్రి గంగుల

ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలి..తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర: మంత్రి గంగుల

కరీంనగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలని మంత్రి గంగుల కమలాకర్​అన్నారు. కరీంనగర్ మండలం బొమ్మకల్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పచ్చని తెలంగాణను దోచుకునేందుకు మళ్లీ దిల్లీ పార్టీలు వస్తున్నయ్. కేసీఆర్ ను ఓడగొట్టి.. రాష్ట్రాన్ని మళ్లీ ఆంధ్రాలో కలిపేందుకు సమైక్య పాలకులు కుట్రలు పన్నుతున్నరు. తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతిల్లోనే ఉంది.

కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మితే మన భవిష్యత్ తరాల జీవితాలు మరోసారి అంధకారమవుతాయి. కర్నాటక ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నరు’ అని గంగుల తెలిపారు.

ALSO READ :- Cricket World Cup 2023: శివాలెత్తిన మ్యాక్స్ వెల్.. వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ