మాజీ ఆర్మీ చీఫ్ నరవణె బుక్ వివాదం..పెంగ్విన్ కు నోటీసులు

మాజీ ఆర్మీ చీఫ్ నరవణె బుక్ వివాదం..పెంగ్విన్ కు నోటీసులు

న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం చుట్టూ రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ.. బుధవారం ఢిల్లీ పోలీసులు ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌజ్​ఇండియా(పీఆర్ హెచ్ఐ)కు నోటీసులు జారీ చేశారు. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా ప్రచురణకు రాకముందే దాని పీడీఎఫ్ వెర్షన్ సోషల్ మీడియాలో, వెబ్‌‌‌‌సైట్లలో అనధికారికంగా సర్క్యులేట్​అవుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. 

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ నోటీసు జారీ చేసింది. పుస్తకం లీక్ అయిన విషయంలో దర్యాప్తుకు సహకరించాలని పెంగ్విన్ సంస్థను కోరింది. ఈ ఘటనపై క్రిమినల్ కాన్స్పిరసీ (కుట్ర) ఆరోపణలతో ఎఫ్​ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ నోటీసు అందజేశారు. ఇటీవల లోక్‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఈ పుస్తకం నుంచి కొన్ని భాగాలను ఉటంకిస్తూ చర్చను లేవనెత్తారు. 

అందులో గల్వాన్ లోయ ఘర్షణలు, ఇతర సున్నితమైన అంశాలపై జనరల్ నరవణే తన అనుభవాలను పంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే, రాహుల్​చర్చను ప్రారంభించగానే పలువురు మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంశారు. ప్రచురితం కాని బుక్​ను పరిగణనలోకి తీసుకోలేమన్నారు.