ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం..

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం..

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.  మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు.  ఈ బిల్లుపై వాడివేడీగా చర్చ జరిగింది. బిల్లు ఆమోదం  సందర్భంగా ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.  దీంతో మూజువాణి ఓటింగ్ తో  బిల్లుకు ఆమోదం తెలిపింది లోక్ సభ. 

 స్పీకర్ పై బిల్లు  కాగితాలు విసిరినందుకు ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూను  లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు  సస్పెండ్ చేశారు. అనంతరం లోక్ సభను రేపటికి వాయిదా వేశారు.  రేపు(ఆగస్టు 4) రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఉదయం లోక్ సభలో బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా విపక్షాలు కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలన్నారు అమిత్ షా. ఢిల్లీ కోసం చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కు ఉందన్నారు. ఎవరి అధికారాలను గుంజుకోవాలనే ఉద్దేశ్యం లేదన్నారు. 

దేశానికి, ఢిల్లీకి మంచి కోసమే ఈ సవరణ బిల్లు తీసుకొస్తున్నట్లు చెప్పారు అమిత్ షా.కూటమి ఉన్నప్పటికీ రాబోయే ఎన్నికల్లో మోడీ పూర్తి మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, అంబేద్కర్, సి రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్ వంటి నేతలు ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారన్నారు.