తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు

తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు
  • బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

నారాయణ్ ఖేడ్: హిందూ సామ్రాజ్య విస్తరణ కోసం ఛత్రపతి శివాజీ గొప్ప పోరాటం చేశాడో.. అదేలాగ ప్రజాస్వామ్య బద్దంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు ప్రజాస్వామ్య హక్కులనేవి కనిపించడం లేదని.. అధికార పార్టీ నాయకులు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నారాయణఖేడ్ పట్టణంలో శివాజీ జయంతి శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ నేత సంగప్పతో కలసి ఎమ్మెల్యే రఘనందన్ రావు ర్యాలీ నిర్వహించి బీజేపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోకి  అక్రమంగా చొరబడుతున్న విదేశీయులను ఎక్కడికక్కడ అడ్డుకునే  విషయంలో హిందూ ధర్మ సంస్థాపనాన్ని కొనసాగించే విషయాల పై హిందూ బంధువులందరు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. గొప్పగా పోరాడి ప్రజాస్వామ్య బద్ధంగా తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎట్లా పరిణమిల్లుతుందో పట్టపగలు రోడ్లమీద న్యాయవాదుల దంపతులను ఎంత దారుణంగా హత్యలు చేశారో ఒక్కసారి మనమందరం ఆలోచించుకోవాలని కోరారు.

For more news…

మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

దృష్టి మళ్లించి చోరీ.. క్షణాల్లో పరార్..  ఇరానీ గ్యాంగ్ గుట్టు రట్టు

ఏం కష్టమొచ్చిందో.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి

ఊహించని ఘటన ఎదురైతే ఎలా రియాక్ట్ కావాలి?