కొత్త పేట్ ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉద్రిక్తత

కొత్త పేట్ ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉద్రిక్తత

కొత్త పేట్ ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. మార్కెట్ ను వైద్యారోగ్య శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే మార్కెట్ కూల్చివేతను ప్రారంభించింది. దీంతో వ్యాపారులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. భారీ బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ అధికారులు మార్కెట్ ను కూల్చివేస్తున్నారు. కమీషన్ వ్యాపారుల షెడ్లు, క్యాంటీన్ బిల్డింగ్, మార్కెటింగ్ శాఖ కార్యాలయాన్ని కూల్చివేశారు. మార్కెట్ ఉన్న స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మార్కెట్ ను కోహెడకు తరలించాలని ఆదేశాలిచ్చింది. అక్కడే పండ్ల మార్కెట్ కోసం స్థలాన్ని కేటాయించింది. అలాగే తాత్కాలికంగా దుకాణాలను కూడా సిద్ధం చేసింది. అయినా వ్యాపారులు కొత్తపేట నుంచి కదలకపోవడంతో అధికారులు కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు.