దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా ఇళ్ల నుంచి బయటకురాలేని పరిస్థితి ఏర్పడింది. పొగమంచు కారణంగా పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 21 రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని రైల్వేశాఖ ప్రకటించింది. మరోవైపు గాలినాణ్యత కూడా ఢిల్లీలో భారీగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 353గా నమోదైంది. ఫిబ్రవరి మొదటి వారం వరకు చలిగాలులు వీస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.
Delhi: A layer of fog engulfs the national capital this morning.
— ANI (@ANI) January 21, 2022
Visuals from near Moti Bagh, South Avenue and Shantipath pic.twitter.com/PiujIbI4je
For More News..