ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నం: భట్టి విక్రమార్క

ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నం: భట్టి విక్రమార్క

ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం రోజుకు18 గంటలు  పనిచేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.పేదలు ఇండ్లు లేక పదేళ్లు ఇబ్బందులు పడ్డారని అన్నారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదాయాన్ని దోచుకుందని..తాము ప్రతీ రూపాయి ప్రజల కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం పేరుతో  బడ్జెట్ పెంచి లక్ష కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రమాదకరంగా కట్టారని డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు భట్టి. 

ఆనాడు కాంగ్రెస్ ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజక్టు, జూరాల కట్టినా ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. అప్పుడు ప్రాజెక్టులు కట్టింది ఇంజినీర్లు. ఇప్పుడు కాళేశ్వరం కట్టింది కూడా ఇంజనీర్లే.  ఎవరి పని వారిని చేయనిస్తే కాళేశ్వరం కూలిపోయేది కాదు.  సంక్షేమం అభివృద్ధి మాకు రెండు కళ్ళు. సంక్షేమం వెనుకబడనీయం, అభివృద్ధి ఆగనీయం. ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుంది. అని భట్టి అన్నారు.