అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నం : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నం : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

అమ్రాబాద్, వెలుగు: రాష్ట్రంలో గూడు లేని ప్రతీ పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని మన్ననూరు గ్రామంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వైఎస్సార్ హయాంలో పేదలకు పక్కా గృహాలు కట్టించామని గుర్తు చేశారు. బీఆర్​ఎస్ డబుల్​ బెడ్రూం అంటూ ఊదరగొట్టిందే తప్ప ఎక్కడా పంపిణీ చేయలేదన్నారు.

గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేస్తే.. కాంగ్రెస్​ ప్రభుత్వం ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఆరు గ్యారంటీల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎల్మపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు. అమ్రాబాద్ లో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి జేసీబీ నడిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు హరినారాయణ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ వెంకటయ్య, మల్లికార్జున్, రేణయ్య తదితరులు పాల్గొన్నారు.