జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు బుధవారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి తరలివచ్చారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అలంపూర్ కు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు.