
కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు మంగళవారం భారీగా భక్తులు తరలివచ్చారు. అంజన్నను దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఘాట్ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలపడంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. స్కూళ్లకు సెలవులు ముగుస్తుండడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. స్వామి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది.