
- కిటకిటలాడిన వేములవాడ
- కోడె మొక్కుల కోసం బారులుదీరిన భక్తులు
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తజనసంద్రంగా మారింది. సోమవారం ఒక్కరోజే 70 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఏపీకు చెందిన భక్తులు ఆదివారం రాత్రే వేములవాడకు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయ ధర్మగుండంలో స్నానాలు చేసిన అనంతరం
కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం ధర్మదర్శనం, కోడె మొక్కు క్యూలైన్లలో బారులుదీరారు. ఆలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీలక్ష్మీగణపతిని, శ్రీరాజరాజేశ్వర స్వామిని, అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం సమర్పించారు. కోడె మొక్కులు చెల్లించేందుకు భక్తులు బారులుదీరారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ గుడిచెరువు పార్కింగ్ స్థలం వాహనాలతో నిండిపోయింది.