
- నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు
- 5. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
జయశంకర్ భూపాలపల్లి, మహాదేవపూర్, వెలుగు: కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పవిత్ర పుష్కర స్నానాల కోసం దేశం నలుమూలల భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం పుష్కరాల 11వ రోజు కాళేశ్వరం త్రివేణి సంగమ తీరం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువ జాము నుంచి మొదలు రాత్రి వరకూ నదీ తీరం జనాలతో నిండిపోయింది.
చీరె సారె సమర్పించడం, నీటి పక్కన సైకత లింగాలకు పూజలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సరస్వతి సంగమం అంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది. సోమవారంతో సరస్వతి పుష్కరాల 12 రోజుల కార్యక్రమం ముగియనున్నందున కాళేశ్వరానికి భక్తుల సంఖ్య పెరిగింది. ఆదివారం ట్రాఫిక్ జామ్ తో భక్తులు ఇబ్బంది పడ్డారు. 5 కి.మీ దూరం నడిచి వచ్చి పుష్కర స్నానాలు చేశారు.