రంగనాయకుల గుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జాం

రంగనాయకుల గుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జాం

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ లోని రంగనాయకుల గుట్ట దగ్గర జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటేత్తారు. అయితే వడ్డెర కాలనీ సమీపంలోని జంపన్న వాగు నుంచి రంగనాయకుల గుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. గంట సేపటి నుంచి ఇబ్బందులు పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.