రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి:డీజీపీ

రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి:డీజీపీ

రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా.. పెట్టు బడులు రావాలన్నా.. నక్సల్స్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ- చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పర్యటించిన మహేందర్ రెడ్డి...సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికల వివరాలపై ఆరా తీశారు. మావోయిస్టు రహిత రాష్ట్రం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.  రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు నిఘా పెంచామని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మహేందర్ రెడ్డి చెప్పారు . అదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు గోదావరి తీరం వెంట నిఘా ముమ్మరం చేశామన్నారు.  రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టులు రాకుండా  ప్రజల భాగస్వామ్యంతో అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.  రాష్ట్రంలో మావోయిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు.. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.