
ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో మత్స్య అభివృద్ధిలో ప్రధాన పోత్ర పోషించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఫిషరీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ దేశంలోనే అనేక రాష్ట్రాలకు తెలంగాణ నుంచి చేపలను ఎగుమతి చేసే విధంగా చేయడంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని తెలిపారు.
ఫీల్డ్లో బాధ్యతగా విధులను నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 1,100 నుంచి 4,000 మంది మత్స్య రైతులను చేయడంలో తమ పాత్ర ఎంతో ఉందన్నారు. సీఎం కేసీఆర్ తమ సేవలను దృష్టిలో పెట్టుకొని మత్స్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ ధర్నాలో కాంటాక్ట్ ఉద్యోగులు పూర్ణచందర్, శ్రీ చైతన్య, భవ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.