పెండింగ్​ స్కాలర్​షిప్స్​,ఫీజు రీయింబర్స్​ మెంట్​ కోసం ధర్నా

పెండింగ్​ స్కాలర్​షిప్స్​,ఫీజు రీయింబర్స్​ మెంట్​ కోసం ధర్నా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్​లో ఉన్న రూ. 7,800కోట్ల స్కాలర్​ షిప్స్​, ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను ప్రభుత్వం రిలీజ్​ చేయాలని ఎస్​ఎఫ్​ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం డిమాండ్​ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, బడ్జెట్​లో విద్యారంగానికి నిధులు పెంచాలనే పలు డిమాండ్లతో ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు.

మెస్​, కాస్మోటిక్​ చార్జీలను పెంచాలన్నారు. ఖాళీగా ఉన్న 26వేల టీచర్​ పోస్టులను, నాన్​ టీచింగ్​ స్టాఫ్​ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. ములకలపల్లి, సుజాతనగర్​, కొత్తగూడెం మండల కేంద్రాల్లో జూనియర్​ కాలేజీలు, హాస్టల్స్​ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ధర్నా చేస్తున్న నేతలను అక్కడి నుంచి లేపేందుకు పోలీస్​లు యత్నించగాతోపులాట జరిగింది. ఈ ప్రోగ్రాంలో నాయకులు సండ్ర భూపేందర్​, అభిమన్యు, సందీప్​, అభిమిత్ర, నాగకృష్ణ, యశ్వంత్​ పాల్గొన్నారు.