
సికింద్రాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత లాస్య నందిత తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి రూ. 1.40 కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తూ బాధితులు ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న, లాస్య నందితతోపాటు ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సమక్షంలో ఈ డబ్బులు ముట్టాయని వారు ఆరోపిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని లాస్య నందిత తమకు హామీ ఇచ్చిందని వారు పేర్కొన్నారు. ఆమె ఎమ్మెల్యే అయ్యాక తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని.. తమ డబ్బు తమకు ఇవ్వాలని అని అడిగితే ఇస్తామని చెప్పారని.. లాస్య నందిత మృతి తరువాత తమ ఫోన్లు ఎత్తడం లేదని.. తమ కాల్స్ బ్లాక్ చేశారని బాధితులు నివేదిత ఇంటి ముందు ధర్నాకు దిగారు.