సినీ పరిశ్రమల్లో వరుస విషాదఛాయలు అలుముకున్నాయి. మొన్నటికి మొన్న టాలీవుడ్ లో సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించిన కొన్నిరోజులకే మరో ప్రముఖ దర్శకుడు సంజయ్ గాధ్వీ (57) ( Sanjay Gadhvi) మరణించారు. సంజయ్ గాధ్వీ హిందీలో ధూమ్, ధూమ్ 2 సినిమాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశాడు.
ఆయన ఇవాళ (నవంబర్ 19) ఆదివారం మార్నింగ్ వాక్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా..అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇక సంజయ్ గాధ్వీ మృతి చెందడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగింది.
తేరే లియే సినిమాతో దర్శకుడిగా ఆయన పరిచయమైయ్యారు. ఆ తర్వాత కిడ్నాప్, మేరే యార్ కి షాదీ హై, అజబ్ గజబ్ లవ్, ధూమ్, ధూమ్ 2 వంటి యాక్షన్ సినిమాలతో పాటు 2020లో 'ఆపరేషన్ పరిందే తో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు.
అంతేకాకుండా, ధూమ్', 'ధూమ్ 2' మూవీస్ హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ లకు భారీ విజయాన్ని తెచ్చి పెట్టడంతో పాటు మంచి పేరుని తీసుకొచ్చాయి. సంజయ్ గాధ్వీ మృతి పట్ల పలువురు హిందీ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా నుంచి ట్వీట్స్ చేస్తున్నారు.
Director of film #Dhoom #SanjayGadhvi died because of heart attack, when he was doing morning walk. I believe, so many people are getting heart attack because of use of Corona vaccine. Corona vaccine is the biggest scam in the world. RIP. pic.twitter.com/yv8ZN0cXJx
— KRK (@kamaalrkhan) November 19, 2023