బెంగాల్‌‌లో‌‌ మేం పోటీ చేయం.. దీదీకే మా మద్దతు

బెంగాల్‌‌లో‌‌ మేం పోటీ చేయం.. దీదీకే మా మద్దతు

ముంబై: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీచేయబోమని మహారాష్ట్రలోని అధికార పార్టీ శివసేన స్పష్టం చేసింది. సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతుగా నిలుస్తామని తెలిపింది. ఈ మేరకు బెంగాల్ ఎన్నికల గురించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఓ లేఖను ట్వీట్ చేశారు. దీదీ నిజమైన బెంగాల్ టైగర్ అని ఆ లెటర్‌లో రౌత్ కొనియాడారు. ఈ ఎన్నికలు దీదీతో మిగతా అందరి పోరుగా సాగుతుందన్నారు. తమ పార్టీ ప్రెసిడెంట్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించాక ఈ నిర్ణయానికి తీసుకున్నామని తెలిపారు. బెంగాల్‌‌లో దీదీ విజయఢంకా మోగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్చి 27, 29న జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.