
- మంత్రికి, ఎమ్మెల్యేలకేనా ప్రొటోకాల్మిగతా వాళ్లకు ఉండదా?
- ఉద్యోగం చేయండి..ఊడిగం చేయొద్దు
- మత్స్యశాఖ అధికారిపై ఎమ్మెల్సీ తాతా మధు ఫైర్
- చేప పిల్లల పంపిణీలో పాల్గొనకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్సీ, ఎంపీలు
- ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో బయటపడ్డ విభేదాలు
కూసుమంచి, వెలుగు: ‘మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డిలకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తరా? మిగతా వాళ్లకు ఎందుకు కట్టలే, వాళ్లకు మాత్రమే ప్రొటోకాల్ ఉందా?’ అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ఆఫ్ ఫిషరీస్పై స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్రావు మండిపడ్డారు. మత్స్యకారులకు 13.11 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయగా, వీటిని పాలేరు జలాశయంలో వదలడానికి ఆదివారం పాలేరు ఎమ్మేల్యే కందాల ఉపేందర్రెడ్డి 10 గంటలకు రావాల్సి ఉండె. ఆయన హైదరాబాద్నుంచి బయలుదేరగా, అంతకుముందే అక్కడికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ్య సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్రావు వచ్చారు. అయితే అక్కడ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే కందాల, కలెక్టర్లకు సంబంధించిన ఫ్లెక్సీలు కనిపించడంతో ఎమ్మెల్సీ ఫిషరీస్ఏడీ ఆంజనేయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మీరు ఆఫీసర్లు ఆఫీసర్లలా ఉండండి. పనికి మాలిన పనులు చేయొద్దు. మీరు గవర్నమెంట్ఆఫీసర్లు కాబట్టి ఎవరికి ఊడిగం చేయద్దు. మంత్రి, ఎమ్మెల్యేలకే ఎందుకు కట్టిర్రు ఫ్లెక్సీలు? మిగతా వాళ్లకు ఎందుకు కట్టలే.. చెప్పిందా గవర్నమెంటు. మాట్లాడనా మీ కమిషనర్తో... జరిగేది ఏంది? చేయండి ఎట్ల చేస్తరో ప్రోగ్రామ్’ అంటూ అక్కడి నుంచి ఎంపీలు నామా, వద్దిరాజు రవిచంద్రతో కలిసి వెళ్లిపోయారు. కొద్దిసేపటికే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కందాల చేప పిల్లలను వదిలారు. కార్యక్రమం తర్వాత అసిస్టెంట్డైరెక్టర్దోమల ఆంజనేయస్వామి మాట్లాడుతూ ప్రొటోకాల్తప్పకుండా పాటిస్తామని, జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఎంపీపీ బానోతు శ్రీనివాస్నాయక్, ఆత్మ కమిటీ డైరెక్టర్ బాలకృష్టారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, జడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మీ పాల్గొన్నారు. కాగా ఈ ఘటనతో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో ఉన్న గ్రూపు విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.