ఎన్నికల బందోబస్తుకు సిద్ధంగా ఉండాలి : డీఐజీ రమేశ్​నాయుడు

ఎన్నికల బందోబస్తుకు సిద్ధంగా ఉండాలి : డీఐజీ రమేశ్​నాయుడు
  • రాజన్న సిరిసిల్ల జోన్-3  డీఐజీ రమేశ్ నాయుడు

మెదక్ టౌన్, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల బందోబస్తుకు పోలీసులు అందరూ సిద్ధంగా ఉండాలని రాజన్న- సిరిసిల్ల జోన్​-3 డీఐజీ రమేశ్​నాయుడు సూచించారు. మెదక్​ పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సూక్ష్మస్థాయిలో ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుందన్నారు.

క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని చెప్పారు. అంతుకుముందు కొత్తగా నిర్మించిన ఎస్పీ కార్యాలయానికి వచ్చిన డీఐజీ రమేశ్​నాయుడుకు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఏఎస్పీ మహేందర్​ బోకే అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మెదక్​, తూప్రాన్​ డీఎస్పీలు ఫణీంద్ర, యాదగిరిరెడ్డి, డీసీఆర్​బీ డీఎస్​పీ శ్రీనివాస్​రెడ్డి, ఎస్​బీ సీఐ సందీప్​ రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.