శతమానం భవతి నెక్స్ట్ పేజి.. నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాకు సీక్వెల్

శతమానం భవతి నెక్స్ట్ పేజి.. నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాకు సీక్వెల్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand), మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగావచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ శతమానం భవతి. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించిన ఈ సినిమా 2017లో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి పండగ, ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వరించింది. దీంతో ఈ సినిమా టాలీవుడ్ కు ప్రత్యేకమైన సినిమా గా మారింది.

దాదాపు 7 సంవత్సరాల తరువాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. తాజాగా సంక్రాతి కానుకగా శతమానం భవతి నెక్స్ట్ పేజి అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే శతమానం భవతి సినిమాకు సీక్వెల్ ప్రకటించిన దిల్ రాజు.. ఈ సినిమాకు పనిచేయబోయే టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ డీటెయిల్స్ మాత్రం రివీల్ చేయలేదు. మరి ఈ సినిమాలో కూడా శర్వానంద్, అనుపమనే యాక్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.