బలగం కళాకారుడికి పద్మశ్రీ.. లక్ష సహాయం చేసిన దిల్ రాజు

బలగం కళాకారుడికి పద్మశ్రీ.. లక్ష సహాయం చేసిన దిల్ రాజు

కేంద్రప్రభుత్వం ఇటీవల పద్మ అవార్డు(Padma Awards)లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ లిస్టులో తెలంగాణకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప(Dasari Kondappa) కూడా ఉన్నారు. ఆయనకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. దాదాపు 50 ఏళ్ళ నుండి బుర్రవీణ సంగీత పరికరంతో పలు పల్లెజానపదాలు పాడుతూ తెలంగాణ సంసృతిని చాటుతున్నారు దాసరి కొండప్ప. ఇటీవల వచ్చిన సూపర్ హిట్ మూవీ బలగం సినిమాలో ఒక పాట పాడి నటించారు దాసరి కొండప్ప.

ఈ సందర్బంగా బలగం చిత్ర యూనిట్ దాసరి కొండప్పని సన్మానించారు. దిల్ రాజు ఆఫీస్ కి వచ్చిన  దాసరి కొండప్పని సన్మానించిన అనంతరం లక్ష రూపాయల చెక్కు అందచేశారు దిల్ రాజు. అంతేకాదు.. లక్ష రూపాయల డబ్బుని కేవలం ఆ పెద్దాయన కోసం మాత్రమే వాడాలని చెప్పారు దిల్ రాజు. ఇదే విషయాన్నీ సోషల్ మీడియాలో పంచుకున్నారు దిల్ రాజు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.