మెగాస్టార్ నెక్స్ట్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్

మెగాస్టార్ నెక్స్ట్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రెండు రీమేక్‌‌లు చేయాలని చిరు ఫిక్స్ అయ్యాడు. మళయాలంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్, తమిళంలో తల అజిత్ యాక్ట్ చేసిన వేదాళం సినిమాలను మెగాస్టార్ రీమేక్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాల్లో ముందు ఏ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందోననే విషయంలో సందేహాలు ఏర్పడ్డాయి. అయితే లూసిఫర్ రీమేక్‌‌నే తొలుత ప్రారంభిస్తారని సమాచారం. తమిళ ఇండస్ట్రీలో రీమేక్ స్పెషలిస్ట్‌‌గా పేరు తెచ్చుకున్న మోహన్ రాజా లూసిఫర్ రీమేక్‌‌కు మెగాఫోన్ చేపట్టడం ఖాయమైంది.

రన్ రాజా రన్, సాహో ఫేమ్ సుజీత్‌‌, వి.వి.వినాయక్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అనూహ్యంగా మోహన్ రాజాను ఎంచుకొని మెగాస్టార్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. జయం మోహన్‌‌రాజా డైరెక్షన్ వహించనున్న తెలుగు లూసిఫర్‌‌ను కొణిదెల ప్రొడక్షన్స్, ఎన్వీఆర్ సినిమా సంయుక్తంగా నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది.