యూనివర్సిటీలలో బ్యాక్ లాక్ పోస్టులను దివ్యాంగులకు కేటాయించాలి

యూనివర్సిటీలలో బ్యాక్ లాక్ పోస్టులను దివ్యాంగులకు కేటాయించాలి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజే దివ్యాంగులను గుర్తించిందని..  దివ్యాంగురాలు రజినీకి సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రం అందించడంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద దివ్యాంగులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా దివ్యాంగుల జేఏసీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు దివ్యాంగులను పెన్షనర్స్ గానే చూశారని.. కాని, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు  సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపుతున్నామని అన్నారు. యూనివర్సిటీలలో కాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులను దివ్యాంగులకు కేటాయించాలని దివ్యాంగులు ప్రభుత్వాన్ని కోరారు.