హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు పీసీసీ సిద్ధమవుతోంది. సోమవారం గాంధీభవన్లో పీసీసీ క్రమశిక్షణా కమిటీ సమావేశం కానుంది. రెండు రోజుల క్రితం బీజేపీని ప్రశంసిస్తూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్కు భవిష్యత్ లేదని, బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. హైకమాండ్ నిర్ణయం మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయించిన వారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తన వ్యాఖ్యలపై రాజగోపాల్రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని పీసీసీ ఎన్నికల కమిషన్ కో–ఆర్డినేటర్జీ నిరంజన్ మండిపడ్డారు. పార్టీ బలోపేతానికి అడ్డుపడుతూ కుటుంబ సభ్యులకే టికెట్లు ఇప్పించుకుంటూ స్వార్థం చూపిస్తున్నారని, వారి వైఖరితో విసిగి వేసారినందువల్లే రాహుల్ గాంధీ కాంగ్రెస్ చీఫ్ పదవి వద్దంటున్నారని అన్నారు. రాజగోపాల్రెడ్డి లాంటి స్వార్థ నాయకులు పార్టీ వీడితేనే శని విరగడవుతుందంటూ కార్యకర్తలు భావిస్తున్నారన్నారు. అలాంటి నేతలు వేరే పార్టీలోకి వెళితే వాళ్ల నోటి దూల తీరుతుందని మండిపడ్డారు.