అమెరికా ఎయిర్షోలో అపశృతి..రెండు జెట్ విమానాలు ఢీ

అమెరికా ఎయిర్షోలో అపశృతి..రెండు జెట్ విమానాలు ఢీ
  • పారాచూట్ల సాయంతో బయటపడ్డ పైలట్లు

వాషింగ్టన్: అమెరికా ఎయిర్ షోలో అపశ్రుతి చోటుచేసుకుంది. రెండు నేవీ జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. అయితే, ఈ ప్రమాదం నుంచి పైలట్లు సేఫ్​గా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నలుగురు పైలట్లు ఎజెక్ట్ అయి పారాచూట్ల సాయంతో సురక్షితంగా ల్యాండ్  అయ్యారు. వాషింగ్టన్  స్టేట్ వెస్టర్న్  ఇడాహోలోని మౌంటెయిన్  హోం ఎయిర్ ఫోర్స్ లో ఈ ఘటన జరిగింది.

యూఎస్  నేవీకి చెందిన ఈఏ 18జీ గ్రోలర్స్  జెట్  విమానాలు ఈ ఎయిర్ షోలో పాల్గొన్నాయి. జెట్ విమానాలు ప్రదర్శన చేస్తుండగా.. అకస్మాత్తుగా ఢీకొన్నాయి. వెంటనే ఆ విమానాలు కూలిపోవడంతో ఘటనా స్థలంలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు పైలట్లు సేఫ్​గా ఉన్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. నలుగురు పైలట్లు ప్రాణాలతో బయటపడడం అద్భుతమన్నారు.