ముగిసిన ట్రాఫిక్‌‌ చలాన్ల డిస్కౌంట్‌‌ ఆఫర్‌‌

ముగిసిన ట్రాఫిక్‌‌ చలాన్ల డిస్కౌంట్‌‌ ఆఫర్‌‌
  •  46 శాతం చలాన్లు క్లియర్​

హైదరాబాద్‌‌, వెలుగు: పెండింగ్ ట్రాఫిక్‌‌ చలాన్స్‌‌ డిస్కౌంట్‌‌ ఆఫర్‌‌ గురువారంతో ముగిసింది. గతేడాది డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ ఆఫర్ ద్వారా రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.59 కోట్ల చలాన్స్ పెండింగ్‌‌లో ఉండగా.. గురువారం నాటికి 1.67 కోట్ల చలాన్స్ క్లియర్ అయినట్లు వివరించింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14కోట్లు, సైబరాబాద్ రూ.31.90 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.18.15 కోట్లు వసూలు అయ్యాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 20,818 చలాన్స్ కు గాను రూ.19.15 లక్షలు వచ్చాయి. మొత్తం పెండింగ్ చలాన్స్ లో కేవలం 46.36 శాతం మాత్రమే క్లియర్ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది.