శివాలయం ధ్వజస్తంభ ప్రతిష్టలో అపశృతి

శివాలయం ధ్వజస్తంభ ప్రతిష్టలో అపశృతి

కృష్ణాజిల్లా: శివాలయం ధ్వజస్తంభ ప్రతిష్టలో అపశృతి చోటు చేసుకుంది. క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని లేపి ప్రతిష్టిస్తుండగా విరిగిపడింది. కార్యక్రమానికి వందల సంఖ్యలో భక్తులు హాజరై వీక్షిస్తుండడంతో పలువురు గాయపడ్డారు. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. బుధవారం శివాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తుండడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని లేపి ప్రతిష్టిస్తుండగా ఒక్కసారిగా విరిగిపడిపోయింది. ధ్వజస్తంభం చుట్టూ భక్తులు గుమిగూడి ఉండడంతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.