కేటీఆర్​ సీఎం కావాలని కుర్చీల పంపిణీ

కేటీఆర్​ సీఎం కావాలని  కుర్చీల పంపిణీ

వరంగల్​సిటీ, వెలుగు: మంత్రి కేటీఆర్​సీఎం కావాలని కోరుతూ బీఆర్ఎస్​సీనియర్​నేత రాజనాల శ్రీహరి 300  కుర్చీలను పంపిణీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్​ చౌరస్తాలో ఈ కార్యక్రమం జరిగింది.

శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ జాతీయ రాజకీయాల్లో నిమగ్నమవుతున్నారని, అందుకే కేటీఆర్​ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.