
పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పురలో శనివారం లబ్ధిదారులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ 328 డబుల్బెడ్ రూమ్ఇండ్లు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే శ్రీగణేశ్తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అధికారులతో కలిసి ఇండ్ల సముదాయాన్ని పరిశీలించారు. మంత్రులు, మేయర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
లబ్ధిదారుల వయసు, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఫ్లోర్ల వారీగా ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా చేపట్టాలని చెప్పారు. జీహెచ్ఎంసీ హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవీందర్, డీఈ సంధ్య, ఏఈ మహేశ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీఈ నాగరాజు, తహసీల్దార్పాండు నాయక్, కంటోన్మెంట్ ఆఫీసర్శశాంక్ తదితరులున్నారు.