కరోనా టైమ్​లో ఎమ్మెల్యేలకు గిఫ్ట్ కూపన్లు

కరోనా టైమ్​లో ఎమ్మెల్యేలకు గిఫ్ట్ కూపన్లు
  • అసెంబ్లీ బడ్జెట్ సెషన్ బహుమతులపై సర్వత్రా విమర్శలు
  • ఒక్కో ప్రజాప్రతినిధికి రూ.లక్ష విలువైన కూపన్స్​

హైదరాబాద్, వెలుగు: లాక్​డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదంటున్న ప్రభుత్వం.. అనవసర ఖర్చులను మాత్రం తగ్గించుకోవడం లేదు. కరోనా కష్టకాలంలో కరోనా టైమ్​లో ఎమ్మెల్యేలకు గిఫ్ట్ కూపన్లుచేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలకు బడ్జెట్ సెషన్ గిఫ్టుగా రూ. లక్ష విలువైన కూపన్లను అధికారులు అందించారు. ఇందుకోసం ఆర్థిక శాఖ రూ.1.60 కోట్లు కేటాయించింది. ఈ కూపన్లతో హైదరాబాద్​లోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షో రూంలో రూ.లక్ష విలువైన వస్తువులను కొనొచ్చు. కరోనా వల్ల ఈ సారి బడ్జెట్ సమావేశాలను కుదించి మార్చి 16న సభను వాయిదా వేశారు. అప్పుడే గిఫ్ట్ కూపన్లు పంచాలని ఆర్థిక శాఖ భావించింది. అదే టైమ్​లో కరోనా కట్టడితో యంత్రాంగం హడావుడి, తర్వాత లాక్ డౌన్ రావడంతో కూపన్ల పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. ఇటీవల లాక్ డౌన్ సడలించడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆర్థిక శాఖ గిఫ్ట్ కూపన్లను పంపిణీ చేసింది.

లాక్ డౌన్ సడలించడంతో కొనుగోళ్లు

లాక్ డౌన్​ సడలించడంతో హైదరాబాద్ కు వచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆ కూపన్లను తమ వ్యక్తిగత సిబ్బందికిచ్చి షో రూమ్​లకు పంపి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే తన భార్యకు యాపిల్ ఫోన్ కొనివ్వాలని గన్​మన్​కు కూపన్ ఇచ్చి షో రూమ్​కు పంపారు. కావాల్సిన మోడల్ లేకపోవడంతో ఆ మోడల్ వచ్చేవరకు కూపన్‌ను జాగ్రత్త చేసుకుని ఇటీవలే ఫోన్ కొన్నట్టు తెలిసింది.