
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 5వ తేదీ జీపీవో(గ్రామ పాలనాధికారి) నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మాదాపూర్లోని హైటెక్స్లో సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు.
ఏర్పాట్లపై సీఎస్మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే దాదాపు 5 వేల మంది జీపీవోల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. సుమారు 120కి పైగా బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జీపీవోలు మధ్యాహ్నం 2 గంటలలోపు హైటెక్స్ చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.