- ఓటర్లకు తాయిలాలు పంచుతున్న అభ్యర్థులు
- ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఓటుకు కొంత ఇస్తున్న నేతలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ఇంకో 12 రోజుల గడువుండగానే పైసల పంపిణీ మొదలైంది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తాయిలాలు ఇవ్వడం షురూ చేశారు. ఓట్లను గ్యారంటీ చేసుకునేందుకు కొందరు అభ్యర్థులు మొదటి విడతగా కొంత నగదు ఇస్తున్నారు. ఒక్కో ఓటుకు నియోజకవర్గాన్ని బట్టి రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు ఫస్ట్ఇన్స్టాల్మెంట్గా ఇస్తున్నారు. పోలింగ్ ముందు మళ్లీ కొంత ఇస్తమని తమకే ఓటు వేయాలని కోరుతున్నారు.
చాలా చోట్ల అభ్యర్థులు ముందస్తు పోల్మేనేజ్మెంట్కు తెరతీశారు.వారి ముఖ్య అనుచరులు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఒక పార్టీ అభ్యర్థి అనుచరుడు శనివారం పోలీసులకు పట్టుబడ్డారు. ఎక్కువ మంది అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ చేస్తుండగా.. దావత్లు మాత్రం బాహాటంగానే ఏర్పాటు చేస్తున్నారు.
త్రిముఖ పోటీ ఉన్న చోట ఇంకా ఎక్కువగా
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న నిర్వహించేందుకు ఎలక్షన్కమిషన్అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మూడోసారి గెలిచి హాట్రిక్కొట్టాలనే ప్రయత్నంలో అధికార బీఆర్ఎస్ఉండగా.. కేసీఆర్ను గద్దె దించేది తామేనని కాంగ్రెస్, బీజేపీ చెప్తున్నాయి. మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈసారి ఓటు విలువ ఎక్కువగా పలుకుతుందని అంచనా వేస్తున్నారు.
త్రిముఖ పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంది. ముందస్తుగా ఓటర్లను రీచ్అయ్యేందుకు పోల్మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. గ్రేటర్శివారులోని నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న కొందరు క్యాండిడేట్లు ఓటర్లకు నగదు, గిఫ్టుల పంపిణీని షురూ చేశారు. గేటెడ్కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, కాలనీల్లో గెట్టు గెదర్లతో ఓటర్లకు గ్రాండ్గా పార్టీలు ఇస్తున్నారు. కాస్ట్లీ లిక్కర్సర్వ్చేస్తున్నారు. పనిలో పనిగా చిన్నపాటి గిఫ్ట్లను చేతిలో పెడుతున్నారు. బస్తీలు, ఇతర ప్రాంతాల్లోని ఓటర్లకు లిక్కర్ (క్వార్టర్బాటిళ్లు) పంపిణీ చేస్తూ.. ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అడ్వాన్స్గా ఇస్తున్నారు.
పోలింగ్కు ముందు మరికొంత నగదు ఇస్తామని, ఈసారి తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోనూ నగదు పంపిణీ మొదలు పెట్టారు. ఒక్కో ఓటర్కు అడ్వాన్స్గా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ముట్టజెప్తున్నారు. అలాగే లిక్కర్ బాటిళ్లు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. కొన్ని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్నియోజకవర్గాల్లోనూ డబ్బు పంపిణీని మొదలుపెట్టారు. మిగతా జిల్లాల్లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు దావత్లు షురూ చేశారు.