ఎంసీఎంసీ సెంటర్ పరిశీలన

ఎంసీఎంసీ సెంటర్ పరిశీలన

మెదక్ టౌన్, వెలుగు: మీడియా సర్టిఫికేషన్ ఆఫ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్‌‌ను మంగళవారం జిల్లా ఎన్నికల పరిశీలకుడు పృధ్వీరాజ్, వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్, పోలీస్​పరిశీలకుడు సంతోష్ కుమార్ తుకారాం తనిఖీ చేశారు. వారి వెంట  జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్  రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్​ కలెక్టర్లు వెంకటేశ్వర్లు,  రమేశ్​ఉన్నారు. ఈ సందర్భంగా వారు  చెక్​పోస్టుల వద్ద   ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల రికార్డింగ్  పనితీరును పరిశీలించారు. 

అనంతరం కలెక్టర్​రాజర్షి షా.. సీ- విజిల్​ యాప్​లో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు, మీడియాలో వచ్చే వార్తల గురించి వివరించారు.