ఎన్​హెచ్​​ 44పై ప్రమాదాల నివారణకు చర్యలు

ఎన్​హెచ్​​ 44పై ప్రమాదాల నివారణకు చర్యలు
  • జిల్లా పరిధిలో ఉన్న 71 కిలోమీటర్ల రోడ్డుపై 
  • బ్లాక్ స్పాట్స్​ వద్ద యూటర్నులు క్లోజ్​ చేయాలని నిర్ణయం
  • పర్మిషన్​ లేని వ్యాపార సముదాయాలపై చర్యలకు సీపీ ఆదేశం

నిజామాబాద్, వెలుగు: జిల్లా మీదుగా వెళ్తున్న ఎన్​హెచ్​44 పై జరుగుతున్న యాక్సిడెంట్స్​పై జిల్లా పోలీస్​కమిషనర్​కల్మేశ్వర్​ ఫోకస్​ పెట్టారు. ఈ హైవే పరిధిలోనిడిచ్​పల్లి పోలీస్​సర్కిల్​లో అత్యధిక ప్రమాదాలు జరిగి, ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అంశాలపై స్టడీ షురూ చేశారు. వీలైనంత మేరకు ప్రమాదాలు తగ్గించడానికి బ్లాక్​స్పాట్స్​ గుర్తించి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

యూటర్నులు క్లోజ్​ 

జిల్లాలో ఇందల్వాయి స్టేషన్​ పరిధిలోని దగ్గి ఫారెస్ట్​ఏరియా నుంచి మెండోరా చాక్రియాల్ ​చౌరస్తా వరకు 71 కిలోమీటర్ల పొడవున ఎన్​హెచ్​44 విస్తరించి ఉంది. ఈ రోడ్డుపై 2023లో 767 యాక్సిడెంట్లు జరిగాయి. 337 మంది ప్రాణాలు కోల్పోగా, తీవ్రగాయాలతో 203 మంది దివ్యాంగులయ్యారు. 2022లో జరిగిన 674 ప్రమాదాల్లో 340 మంది మృతి చెందారు. రోడ్డుపై 12 చోట్ల అత్యధికంగా యాక్సిడెంట్స్​ జరుగుతున్నట్లు సీపీ కల్మేశ్వర్​ గుర్తించారు.

12 బ్లాక్ స్పాట్స్ ​వద్ద యూటర్నులు క్లోజ్​ చేయాలని నిర్ణయించారు. పర్మిషన్ ​లేని దాబాలు, వ్యాపార సముదాయాలపై యాక్షన్​ తీసుకోవాలని సీపీ ఆదేశించారు. వెహికల్స్​ స్పీడ్​ కంట్రోల్​  చేసేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి, రేడియం స్టిక్కర్లు అంటించాలని, పార్కింగ్​స్థలాల్లోనే వెహికల్స్​ పార్క్​ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇందల్వాయి టోల్​గేట్​ మేనేజ్​మెంట్​కు ఆర్డర్స్​
 జారీ చేశారు.